ఇంజనీరింగ్లో సుస్థిర కెరీర్ను అందుకునే లక్ష్యంతో కాలేజీ క్యాంపస్లో అడుగుపెడుతున్నారు. ప్రతిష్టాత్మక ఐఐటీ అయినా, సాధారణ కళాశాల అయినా ఎందులో చేరినప్పటికీ నాలుగేళ్ల బీటెక్/బీఈ కోర్సులో మొదటి ఏడాది నుంచే మెరవాలి... మెరికల్లా ముందుకు సాగాలి! అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు వ్యక్తిగతంగా, అకడమిక్గా తమను తాము తీర్చిదిద్దుకునేందుకు నిపుణుల సూచనలు...
ఇంటర్లో చేరినప్పటి నుంచి ఇంజనీరింగ్ లక్ష్యంగా విద్యార్థులు చదువుతుంటారు. రెండేళ్ల పాటు పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియదనే విధంగా కష్టపడిన విద్యార్థులు, ఇంజనీరింగ్లో చేరగానే ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలో అడుగుపెట్టినట్లు భావిస్తారు. ఈ స్వేచ్ఛకు పరిమితులు విధించుకోవాలి. లక్ష్యాన్ని మరవకుండా, దాన్ని సాధించడంపైనే దృష్టినిలపాలి.
బీటెక్లో‘మొదటి’ నుంచే మెరవాలి!